HomeTelugu Trendingసందీప్‌ కిషన్‌ మరో కొత్త వ్యాపారం

సందీప్‌ కిషన్‌ మరో కొత్త వ్యాపారం

1 4

యువ నటుడు సందీప్ కిషన్ మరో కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నాడు. ఇప్పటికే హీరోగా, నిర్మాతగా విజయాలు అందుకున్న సందీప్ కిషన్.. మంచి వ్యాపారవేత్త కూడా! హైదరాబాద్, సికింద్రాబాద్‌లో ‘వివాహ భోజనంబు’ పేరుతో పలు రెస్టారెంట్లు నడుపుతున్నాడు.. విజయవంతంగా రెస్టారెంట్ నిర్వహిస్తూనే కొత్తగా మరో వ్యాపారంలోకి అడుగుపెట్టారు. తన బిజినెస్‌ను ప్రారంభించడానికి ఈ సారి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ఎంచుకున్నాడు ఈ యంగ్ హీరో.. త్వరలో ఆయన అమరావతిలో ఒక సెలూన్ ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాడు.

ఇప్పటికే స్టైలిష్ రంగంలో పేరొందిన క్యూబీఎస్ సెలూన్ ఫ్రాంచైజీని సందీప్ కిషన్ తీసుకున్నారు. త్వరలో ఆ సెలూన్ ప్రారంభం కానుంది. ఇక, సినిమాల విషయానికి వస్తే… హాకీ నేపథ్యంలో సందీప్ కిషన్ ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన నిర్మాతగా పరిచయమైన చిత్రం ‘నిను వీడని నీడను నేనే’తో విజయాన్ని అందుకున్నాడు.. ‘తెనాలి రామకృష్ణ’తో కమర్షియల్ విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఇలా.. నటుడు, నిర్మాత, బిజినెస్‌మెన్‌గా సత్తా చాటుతున్నాడు ఈ యంగ్ హీరో.

Recent Articles English

Gallery

Recent Articles Telugu