HomeTelugu Trendingదిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు ఏమంది?

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు ఏమంది?

10 8
‘దిశ’ నిందితుల ఎన్ కౌంటర్ పై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్‌కౌంటర్‌పై అనుమానాలున్నాయంటూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌పై ఈరోజు వాదనలు ముగిశాయి. నిందితుల ఎన్ కౌంటర్ పై విచారణ కమిషన్ ను ఏర్పాటు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయడంతో పాటు పోలీసు ఉన్నతాధికారులతోనూ ఎన్ కౌంటర్ పై దర్యాప్తు చేస్తున్నామని తెలంగాణ ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది రోహత్గి తెలిపినప్పటికీ దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేయాల్సిందేనని సుప్రీంకోర్టు విచారణ కమిషన్ ను ఏర్పాటు చేసింది.

సుప్రీంకోర్టు మాజీ జడ్జి వీఎస్ సిర్పూర్కర్ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కమిటీ విచారణ జరుపుతుందని తెలిపింది. హైదరాబాద్ లోనే ఉండి దర్యాప్తు చేయాలని ఆ కమిటీకి సూచించింది. ఎన్ కౌంటర్ పై విచారణ ప్రారంభించిన తేదీ నుంచి ఆరు వారాల్లోగా తమకు నివేదిక సమర్పించాలని చెప్పింది. ఈ కమిటీలో వీఎస్ సిర్పూర్కర్ తో పాటు బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రేఖా ప్రసాద్ సీబీఐ మాజీ డైరెక్టర్ కార్తికేయన్ ఉన్నారు. కమిషన్ కు సీఆర్పీఎఫ్ భద్రత కల్పించిన కోర్టు, కమిషన్ ఖర్చులు రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని పేర్కొంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu