బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య.. సినీ ఇండస్ట్రీని విషాదానికి గురిచేసింది. ఆయన మృతిపై బాలీవుడ్ తోపాటు టాలీవుడ్, కోలీవుడ్ పరిశ్రమల నటీనటులు సైతం సంతాపం ప్రకటించారు. ఇక ఆయన ఆత్మహత్య చేసుకోవడంపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. చనిపోయిన చోట ఎలాంటి సూసైడ్ నోట్ లేకపోవడం అనుమానాలకు దారి తీస్తుంది. అంతే కాకుండా సుశాంత్ కెరీర్ పరంగా చూసుకుంటే ఆయనకు ఆఫర్లు కూడా బాగానే ఉన్నాయి. ఇటీవలే ఆయన తీసిన చిచోరే సినిమా కూడా మంచి విజయం సాధించింది. దీంతో అందరిలో ఆయన అసలు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో అని అనుమానం మొదలైంది. ప్రస్తుతం ఆయన ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో తేల్చేందుకు పోలీసులు విచారణ చేపడుతున్నారు. విచారణ లో భాగంగా ఆయన గర్ల్ ఫ్రెండ్, హీరోయిన్ రియా ను పోలీసులు విచారించనున్నారు. చివరి సారిగా సుశాంత్సు, రియాలు ముంబయి లోని ఓ జిమ్ వద్ద మార్చ్ 11న కలిశారు. వారిని ఓ వ్యక్తి ఫోటో తీయటం తో ఆ ఫోటో సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టింది. ఇక సుశాంత్ చనిపోయిన తరవాత ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాంతో పోలీసులు ఆమెను విచారించడానికి సిద్ధమౌతున్నారు. విచారణలో ఇద్దరి మధ్య సంభందం పై ప్రశ్నించనున్నారు. మరోవైపు, ఉరి వేసుకోవడం వల్లే సుశాంత్ చనిపోయాడని పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ లో వెల్లడైంది. ఊపిరి ఆడకపోవడం (asphyxia) వల్లే ప్రాణాలు కోల్పోయాడని తేలింది.