HomeTelugu Big Storiesపవన్‌ కల్యాణ్‌పై తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు

పవన్‌ కల్యాణ్‌పై తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు

11 15

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లో ఆవేశం తప్ప ఆలోచన కనిపించడం లేదన్నారు టాలీవుడ్ సీనియర్ దర్శక నిర్మాత, సినీ, రాజకీయ విశ్లేషకులు తమ్మారెడ్డి భరద్వాజ. ఆయన ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటానని పదే పదే చెబుతున్నా ఆయనలో ఆవేశం తప్ప ఆలోచన కనిపించడం లేదన్నారు. రానున్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి అధికారం చేపట్టడానికి ఎంత వరకూ ఛాన్స్ ఉంది.. అందుకు అనుసరించాల్సిన విధానాలపై అభిప్రాయాలను పంచుకున్నారు తమ్మారెడ్డి. “ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చంద్రబాబు, జగన్‌తో పాటు పవన్ కళ్యాణ్ కూడా చాలా కీలకమని అన్నారు. ఈ ముగ్గురు వ్యక్తుల మీదే ఏపీలో రాజకీయాలు ఆధారపడి ఉంటాయి కానీ పార్టీల ప్రభావం పెద్దగా ఉండదని అన్నారు. వీళ్ల వ్యక్తిత్వం ద్వారానే ఓట్లు వస్తాయని చెప్పారు. ప్రజల అభిప్రాయం కూడా ఇదే అయ్యి ఉంటుందని భావిస్తున్నట్లు చెప్పారు.

పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుకి సపోర్ట్ చేయడం వల్ల ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తరువాత నాలుగు సంవత్సరాలు చంద్రబాబుకి సపోర్ట్ చేశారు. అయితే 6 నెలల ముందు సెపరేట్‌గా జనంలోకి వచ్చి ఒంటరిగా పోరాటం చేస్తామంటున్నారు. పొలిటికల్‌గా యాక్టివ్‌ అయ్యారు. ఇవన్నీ పాజిటివ్ విషయాలే. అయితే ఆయన చేస్తున్న దాంట్లో మళ్లీ పాతవాళ్లనే పార్టీలోకి తీసుకుంటున్నారు. అందులో మంచి వాళ్లు ఎవరు? చెడ్డ వాళ్లు ఎవరో తేలడం లేదు. గతంలో ప్రజారాజ్యం పార్టీలో ఏవైతే తప్పులు జరిగాయో అవి ఇప్పుడు జరక్కుండా ఉండాలి అన్నారు.

చిరంజీవికి పవన్ కళ్యాణ్‌కు తేడా ఏమిటంటే.. చిరంజీవి నలుగురిని సంప్రదించి ఆయన ఒక నిర్ణయం తీసుకుంటారు. తొందరగా ఏ నిర్ణయం తీసుకోలేరు. అంతేకాకుండా ఆయనకు బెండింగ్ నేచర్ ఉంది. నేను పట్టిందానికి మూడే కాళ్లు అన్నట్టుగా కాకుండా చర్చించి నిర్ణయం తీసుకుంటారు. ఈ ప్రాసెస్‌లో ప్రభావితం అవుతారు. ఆ మెతకతనం వల్ల ఆయనకు నష్టం జరిగి ఉండొచ్చు. లాభం కూడా ఉండొచ్చు. నిజానికి ఆయన మెగాస్టార్ అయ్యింది ఆ మెతకతనం వల్లే.. ప్రజారాజ్యం ఓడిపోయింది ఆ మెతకతనం వల్లే.

అయితే పవన్ కళ్యాణ్ అలాంటి వ్యక్తి కాదు.. మొదటి నుండి చాలా మొండిగా సూటిగా ఉంటారు. ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. అయితే రాజకీయాల్లో మీ మొండి తనం ఎంత వరకూ పనికి వస్తుంది.. ఎంతవరకూ పనిచేయదన్నది చూడాలి అన్నారు. పవన్‌కు ఆవేశం ఎక్కువ అని నాకు తెలుసు. ఆవేశంగా నిర్ణయాలు కాకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మంచిది. మీరు మాటలు చెబుతారు.. నేను చాలా ఆలోచించి చేస్తా అంటారు కాని.. మీరు ఆలోచిస్తున్నారని నాకు అనిపించడం లేదు. మీకు మంచి అవకాశం ఉంది. మాటల్ని ఓట్లుగా మార్చుకోగలగాలి. ప్రజలకి మీపై నమ్మకంతో పాటు భయం, అనుమానం ఉంది. వీళ్లు ఏమౌతారు? పార్టీని ఏం చేస్తారు? అనే సందేహాలు ప్రజల్లో ఉన్నాయి అంటూ ఓ యూట్యూబ్ ఛానల్ ద్వారా తన అభిప్రాయాన్ని తెలియజేశారు తమ్మారెడ్డి భరద్వాజ.

అయితే ఏపీకి ప్రత్యేక హోదా కోసం జరుగుతున్న పోరాటాన్ని చంద్రబాబు నాయుడు క్యాష్ చేసుకుంటున్నారు. కానీ పవన్ కల్యాణ్ అది చేయలేకపోతున్నారని అన్నారు తమ్మారెడ్డి. ఎప్ప్పుడైతే చంద్రబాబు యూటర్న్ తీసుకుని మోడీని తిట్టడం మొదలు పెట్టారో… మీకు ఇక్కడ టార్గెట్ మోడీని తిడితే చంద్రబాబుకి సపోర్ట్ అయినట్టు అవుతుంది. చంద్రబాబు లాంటి వ్యక్తి ఎలక్షన్ జిమిక్కులు బాగా తెలిసినవారు. ఇక మీ పార్టీ కార్యక్రమాలకు, యాత్రలకు వస్తున్న జనం ఎంత వరకూ ఓట్లుగా మారతాయన్నది ఇక్కడ చాలా ముఖ్యం. మీకు గుర్తుండే ఉంటుంది.. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఇంతకంటే ఎక్కువ మంది జనం వచ్చిన రోజులు ఉన్నాయి. కాని ఆ జనాన్ని ఓట్లుగా మార్చుకోలేకపోయారు. ఇప్పుడు మీకు ఓట్లుగా మార్చుకోగలరా? అలా మార్చుకోవడానికి మీ మంత్రాంగం, యంత్రాంగం ఉందా? దానికి మీ ఏర్పాట్లు ఏమిటన్నది ముఖ్యమని అన్నారు తమ్మారెడ్డి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu