ఏపీ సచివాలయం వద్ద ఓ డ్రోన్ కెమెరా కలకలం సృష్టించింది. నారా లోకేష్ సహా పలువురు ఎమ్మెల్సీలకు ప్రమాదం తప్పింది. సచివాలయం వద్ద బస్సు దిగి వస్తున్న ఎమ్మెల్సీలు లోకేశ్, అశోక్ బాబు, దీపక్రెడ్డికి సమీపంలో డ్రోన్ పడింది. ఆపరేటింగ్ లోపంతో విద్యుత్ తీగలు తగిలి పోలీసుల డ్రోన్ కెమెరా కిందపడింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆ డ్రోన్ను అక్కడి నుంచి తొలగించారు.