HomeTelugu Newsసన్యాసులకూ భారతరత్న ఇవ్వాల్సిందే: రాందేవ్ బాబా

సన్యాసులకూ భారతరత్న ఇవ్వాల్సిందే: రాందేవ్ బాబా

11 16ప్రముఖ యోగా గురు రాందేవ్ బాబా సన్యాసులకు భారతరత్న ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేశారు. దేశ అత్యున్నత పౌరపురస్కారమైన ‘భారతరత్న’ ప్రకటనపై ప్రముఖ యోగా గురు రాందేవ్ బాబా అసంతృప్తి వ్యక్తం చేశారు. 70 ఏళ్ల దేశ చరిత్రలో ఒక్క సన్యాసికి కూడా భారతరత్న అవార్డును ఇవ్వలేదని విచారణ వ్యక్తం చేశారు. వచ్చే ఏడాదైనా అత్యున్నత పురస్కారం ఇచ్చి సన్యాసులను గౌరవించాలని విజ్ఞప్తి చేశారు. మహారుషి దయానంద సరస్వతి, స్వామి వివేకానంద, శివకుమార స్వామి లాంటి ప్రముఖులకు కూడా ఈ గౌరవం దక్కలేదన్నారు. వచ్చే ఏడాదైనా కేంద్రం సన్యాసుల పట్ల సానుకూలంగా స్పందించి ఒక్కరికైనా భారతరత్న ఇస్తుందని ఆశిస్తున్నామని బాబా రాందేవ్‌ పేర్కొన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu