HomeTelugu Newsఅమెరికాలో ప్రమాదం, ముగ్గురు తెలుగువాళ్లు మృతి

అమెరికాలో ప్రమాదం, ముగ్గురు తెలుగువాళ్లు మృతి

10 22
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలుగు వాళ్లు మృతిచెందారు. మృతులు హైదరాబాద్‌కు చెందిన దంపతులతో పాటు ఏపీకి చెందిన మరో వ్యక్తి ఉన్నారు. ముషీరాబాద్‌లోని గాంధీనగర్‌కు చెందిన భార్యాభర్తలు ఆవుల దివ్య(34), గవిని రాజా(41) దుర్మరణం పాలైనట్లు కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. వీరిద్దరు టెక్సాస్‌లోని ఫ్రిస్కోలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. రాజా, దివ్య దంపతులు కొత్తగా నిర్మిస్తున్న తమ ఇంటిని పరిశీలించేందుకు వారి స్నేహితుడు విజయవాడకు చెందిన రామనాథం(42)తో పాటు కారులో వెళ్తుండగా ప్రమాదానికి గురై ముగ్గురూ మృతిచెందినట్లు తెలిసింది. వీరు ప్రయాణిస్తున్న కారును ఓ ట్రక్కు వేగంగా వచ్చి ఢీకొనడంతో ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన సమయంలో దివ్య కారు డ్రైవ్ చేస్తున్నట్లు సమాచారం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu