HomeTelugu Big Storiesవివాదంలో ఉపాసన!

వివాదంలో ఉపాసన!

Upasana in controversy

మెగాస్టార్ కోడలు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి వివాదంలో చిక్కుకున్నారు. తాజాగా హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా పోస్ట్ చేసిందంటూ ఉపాసనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫేస్ బుక్ వేదికగా ఉపాసనపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా ప్రజలకు పలు విషయాలపై అవగాహన కల్పిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఉపాసనపై నెటిజన్లు అంతగా ఆగ్రహం చెందడానికి కారణమైన ఆ పోస్ట్ ఏమిటంటే ?

జనవరి 26న భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు ఉపాసన శుభాకాంక్షలు తెలిపారు. ఉపాసన తన ఫేస్‌బుక్ పేజీలో ఒక ఆలయ గోపురం ఫొటోను షేర్ చేసింది. గుడి గోపురంపై ఉన్న దేవుడి విగ్రహాల మధ్యలో కొందరు సామాన్యులు నిల్చున్నట్లుగా ఆ ఫొటోను ఎడిట్ చేశారు. గోపురంపై నిలబడి ఉన్న వాళ్లలో తాను, తన భర్త రామ్ చరణ్ కూడా ఉన్నారని వెల్లడించింది. ఆ ఫొటో తనకు బాగా నచ్చిందని, దాన్ని ఎడిట్ చేసిన ఆర్టిస్ట్ తనకు డైరెక్ట్ మెసేజ్ పెడితే అభినందించాలని ఉపాసన రాసింది.

ఉపాసన షేర్ చేసిన ఫొటోకు నెటిజన్ల నుంచి ఊహించని సమాధానాలు వచ్చాయి. మీరు ఎంత గొప్పవారైనా దేవుడి గోపురాన్ని ఇలా అడ్డం పెట్టుకుని ప్రచారం చేసుకోవడం తగదని, హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని విమర్శించారు. మరో నెటిజన్ ఫొటో తీసిన కళాకారుడిని ప్రశంసించడం కంటే, వేల సంవత్సరాల క్రితం ఆ దేవాలయాన్ని నిర్మించిన కళాకారులను గుర్తుంచుకోండి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా మీరు ఇచ్చిన సందేశం ఏమిటి? ఈ ఫొటోను షేర్ చేసి భారతీయులను అవమానించడం ఎందుకు? ఆ పోస్ట్‌ను వెంటనే డిలీట్ చేయాలని కూడా నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

మొదటగా సమంతనే విడాకులు కోరింది: నాగార్జున

Recent Articles English

Gallery

Recent Articles Telugu