రౌడీ హీరో.. విజయ్ దేవరకొండ ..డైరెక్టర్ పూరి కాంబినేషన్లో వస్తున్న చిత్రం ‘లైగర్’. ఈ నెల 25వ తేదీన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో విజయ్ దేవరకొండ బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. లోకేశ్ కనగరాజ్ ప్రస్తావన తీసుకుని వచ్చాడు. లోకేశ్ కనగరాజ్ గురించి విన్నాను. తాజాగా ఆయన నుంచి వచ్చిన ‘విక్రమ్’ సినిమాను చూశాను. ఆ సినిమాను చూస్తూ నన్ను నేను మరిచిపోయాను. మొదటి నుంచి చివరివరకూ ఆ సినిమా అలా కూర్చోబెట్టేసింది.
లోకేశ్ కనగరాజ్ ఆ సినిమాను చాలా అద్భుతంగా తీశాడు. అందువల్లనే దానికి ఆ స్థాయి ఆదరణ లభించింది. లోకేశ్ కనగరాజ్ సినిమాటిక్ ప్రపంచంలోకి అడుగుపెట్టాలని నాకు చాలా ఉత్సాహంగా ఉంది. త్వరలోనే ఆయన నుంచి నాకు కాల్ వస్తుందని అనుకుంటున్నాను” అన్నాడు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న లోకేశ్ నుంచి విజయ్ కి ఎప్పుడు కాల్ వస్తుందన్నది చూడాలి మరి. ఇక ప్రస్తుతం శివ నిర్వాణ డైరెక్షన్లో విజయ్ ‘ఖుషి’ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే.