HomeTelugu Trending'సరిలేరు నీకెవ్వరు'పై విజశాంతి పోస్ట్‌..

‘సరిలేరు నీకెవ్వరు’పై విజశాంతి పోస్ట్‌..

1 24
అలనాటి అందాల హీరోయిన్ గా, ఆపై లేడీ ఓరియంటెడ్ సినిమాలతో పేరు తెచ్చుకున్న విజయశాంతి, చాలా కాలం తరువాత సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు హీరోగా నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అప్ డేట్ గురించి ఎటువంటి వార్త బయటకు వచ్చినా అది వైరల్ అవుతోంది. తాజాగా, తన ఫేస్ బుక్ ఖాతాలో విజయశాంతి, ఓ పోస్ట్ ను పెట్టారు.

“మనం భారతీయులం
‘సరిలేరు మనకెవ్వరు’
సంప్రదాయంగా.. సంస్కృతి ధర్మపరంగా..
ఇది మన దేశం నేర్పిన విధానం
ఆ ఉన్నత విలువలతో కూడిన ఒక చక్కని సందేశాత్మక చిత్రంగా మీ ముందుకు వస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం టైటిల్ నెంబర్ నేటి సాయంత్రం 5.04 గంటలకు విడుదల కానుంది. జనవరి 5, 2020వ తేదీన ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరగనుంది, ఈ సందర్భంగా మన సినిమాను అభిమానంతో స్వాగతిస్తున్న ప్రజలకు, అభిమానులకు గౌరవ అతిథులకు ధన్యవాదాలతో…
మీ
విజయశాంతి” అని పోస్ట్ పెట్టారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu