HomeTelugu Big Stories‘మై మమ్మా సెడ్’.. సమంత పోస్ట్‌ వైరల్‌

‘మై మమ్మా సెడ్’.. సమంత పోస్ట్‌ వైరల్‌

Samantha another post on my

నాగ చైతన్యతో విడాకులు ప్రకటించిన తరువాత సమంత ఆ బాధ నుంచి కోలుకుని జీవితంలో ముందుకు సాగాలని ప్రయత్నిస్తోంది. అన్నీ మర్చిపోయి మళ్ళీ పనిలో పడడానికి ముందు సమంత ఆధ్యాత్మిక పర్యటనలకు వెళ్లింది. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే విడాకులు తీసుకునే ముందు సమంత ‘మై మమ్మా సెడ్’ ఏ హ్యాష్ ట్యాగ్ తో చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకే దారి తీసింది. మళ్ళీ చాలా రోజుల తరువాత సామ్ ‘మై మమ్మా సెడ్’అనే హ్యాష్ ట్యాగ్ తో మరో ఆసక్తికర పోస్టును చేసింది.

తాజాగా సామ్ “ఇప్పుడు మీరు ఇలా ఉన్నందుకు కృతజ్ఞతతో ఉండండి. రేపు మీరు ఏం కావాలనుకుంటున్నారో దాని కోసం పోరాడుతూ ఉండండి” అంటూ ఇన్స్టా లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం సమంత రెండు కొత్త చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలోనే షూటింగ్ లో పాల్గొననుంది. ప్రస్తుతం ఆమె నటించిన “శాకుంతలం” విడుదలకు సిద్ధమవుతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu