సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా ఒకే చేసుకున్నా కూడా ఎందుకో దర్శకులు సడెన్ గా మారిపోతున్నారు. భరత్ అనే నేను, మహర్షి తరువాత మహేష్ బాబుతో సుకుమార్ సినిమా చేయాల్సి ఉన్నది. సీరియస్ కథ కావడంతో అది ఇప్పుడు ఎందుకులే అని చెప్పి యాక్షన్ ఎంటర్టైనర్ కు పచ్చజెండా ఊపాడు. మహేష్ 26 వ సినిమా సరిలేరు నీకెవ్వరూ సినిమాను అనిల్ రావిపూడితో చేసి మంచి విజయం సాధించారు. ఈ సినిమా రిలీజ్ కు ముందే వంశీతో సినిమా ఉంటుందని చెప్పడం విశేషం.
వంశీ పైడిపల్లి చెప్పిన కథకు నచ్చడంతో స్క్రిప్ట్ వర్క్స్ లో ఉన్నారు. అయితే, ఇప్పుడు మహేష్ 27 వ సినిమాకు సంబంధించిన మరో ట్విస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. మహేష్ 27 వ సినిమాను వంశీ కాకుండా గీతగోవిందం వంటి సూపర్ హిట్ సినిమా తీసిన పరశురామ్ దర్శకత్వంలో ఉండబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. పరశురామ్ చెప్పిన స్క్రిప్ట్ నచ్చడంతో మహేష్ బాబు ఒకే చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిచబోతున్నట్టు తెలుస్తుంది. అసలు విషయం ఏంటి అన్నది తెలియాలంటే మహేష్ బాబు ప్రకటించే వరుకు వేచి చూడాల్సిందే.