Homeతెలుగు Newsపంపింగ్ లో ప్రపంచ రికార్డు.. మేఘా సామర్థ్యానికి నిదర్శనం

పంపింగ్ లో ప్రపంచ రికార్డు.. మేఘా సామర్థ్యానికి నిదర్శనం

తెలంగాణలో నిర్మించిన ప్రపంచంలోనే పెద్దదైన బహుళదశల ఎత్తిపోతల పథకంలో అనతికాలంలోనే నీటి పంపింగ్ లో రికార్డ్ సాధించింది. ఈ పథకంలోని ప్రధానమైన నాలుగు పంపింగ్ కేంద్రాల్లో ఒక్కొక్క కేంద్రం నుంచి వంద టీఎంసీల చొప్పున నీటిని ఎగువకు ఎత్తిపోసింది. లింక్ -1 లోని మేడిగడ్డ లక్ష్మీ దాదాపు 100 టిఎంసీలకు దగ్గరగా ఉండగా, అన్నారం సరస్వతి, సుందిళ్ల పార్వతి, లింక్-2లో ప్యాకేజ్-8 భూగర్భ గాయత్రి పంపింగ్ కేంద్రాల నుంచి మొత్తం మీద 100 టిఎంసీల చొప్పున పంపింగ్ ను చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. అతి తక్కువ సమయంలో ఇంత పెద్ద ప్రాజెక్ట్ ను పూర్తి చేయడమే కాకుండా అనతికాలంలోనే వందల టిఎంసీల నీటిని ఎంఈఐఎల్ పంపింగ్ చేసింది.

ఎన్నో ఏండ్లుగా నీరందని తెలంగాణ పొలాలు ఇప్పుడు పచ్చని పైరును కప్పుకుని కలకలలాడుతున్నాయి. ఎంతో కాలంగా నీటి కోసం ఎదురు చూసిన రైతన్నలు కాళేశ్వరం నీటి రాకతో తమ బీడు భూములను సస్యశ్యామలం చేసుకుంటున్నారు. ఇంతటి బహుళర్ధక ఎత్తిపోతల పథకం తెలంగాణ దశనే మార్చేసింది. ఇప్పుడు తెలంగాణ ప్రాంతం కాశేళ్వరం ప్రాజెక్టుతో జలకళను సంతరించుకున్నాయి. ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు పట్టుదలతో పాటు మేఘా శక్తిసామర్ధ్యాలతో ఇది సాధ్యమయ్యింది. అనతికాలంలోనే రూపుదిద్దుకుంది.

కాళేశ్వరంలోని ఏ పంప్ ఎంత నీటిని ఎత్తిపోసిందంటే?

ఇక భూ ఊపరితలంపైన అతిపెద్దదైన లక్ష్మీ పంప్ హౌస్ ను జూలై 6, 2019లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ప్రారంభించారు. అప్పటి 522 రోజుల పాటు పని చేసి దాదాపు 100 టిఎంసీల నీటిని పంప్ చేసింది. ఇక కీలకమైన ఈ పంప్ హౌస్ లో 3వ మిషన్ 1110 గంటల పాటు పని చేసి నీటిని ఎత్తిపోసింది. అత్యల్పంగా 13 వ మిషన్ 262 గంటల పాటు పనిచేసింది. కాళేశ్వరం మొట్టమొదటి పంప్ హౌస్ ఇదే. ప్రాణహిత నీటిని గోదావరిలోకి ఎత్తిపోయడం లక్ష్మీ పంప్ హౌస్ నుండే ప్రారంభమవుతుంది.

Kaleshwaram Project 3

లక్ష్మీ పంప్ హౌస్ ను పార్వతి పంప్ హౌస్ కు అనుసంధానం చేసే సరస్వతి పంప్ హౌస్ 363 రోజుల పాటు నీటిని ఎత్తిపోసింది. 100 టీఎంసీలను నీటిని ఎగువకు తరలించింది. ఇందులో మొదటి మిషన్ 1347 గంటలు పాటు పని చేసింది. అతి తక్కువగా 12 వ మిషన్ 195 గంటల పాటు పనిచేసింది.

ఇక లింక్-1లో చివరిదైన పార్వతి పంప్ హౌస్ సైతం సత్తా చాటాంది. ఏకంగా 504 రోజుల పాటు నీటిని పంప్ చేసింది. 100 టీఎంసీల నీటిని ఎత్తిపోసింది. ఇందులో అత్యధికంగా రెండవ మిషన్ 1076 గంటల నీటిని ఎత్తపోసింది. అత్యల్పంగా 14 వ మిషన్ కేవలం 333 గంటల పాటు పని చేసింది.

అతి కీలకం గాయత్రి పంప్ హౌస్

లింక్-2లో భూగర్భ అద్భుతమైన గాయత్రి పంప్ హౌస్ ను ఆగష్టు 11, 2019లో ప్రారంభించిన మేఘా అనతికాలంలోనే 100 టిఎంసీల ఎత్తిపోసింది. గాయత్రి పంప్ హౌస్ నుండి ప్రాణహిత నీటిని శ్రీపాద సాగర్‌ ఎల్లంపల్లి నుంచి మిడ్‌ మానేరుకు తరళించారు. ఈ పంప్ హౌస్ లో రెండవ మిషన్ అత్యధికంగా 1703 గంటల పాటు నీటిని పంపింగ్ చేయగా, మొదటి మిషన్ 1367 గంటల పాటు పనిచేసి 111 మీటర్ల ఎత్తుకు నీటిని పంప్ చేసింది. గాయత్రిలోని 7 మిషన్ లలో ఒక్కొక్క మిషన్ నుండి 3150 క్యుసెక్కుల నీటిని విడుదల చేశాయి.

ఇంతవరకూ ఎక్కడా చేపట్టనంతటి భారీ స్థాయిలో పంపుహౌస్‌లను ఈ పథకంలో ఏర్పాటు చేసింది. రోజుకు గరిష్టంగా 3 టిఎంసీల నీటిని ఎత్తిపోసే విధంగా నిర్మించిన ఈ భారీ పథకంలో 20 పంపుహౌస్‌ల కింద మొత్తం 104 మెషీన్‌లను ఏర్పాటు చేసింది. కాళేశ్వరంలో మొత్తం 22 ఎత్తిపోతల కేంద్రాలు నిర్మించగా అందులో 15 కేంద్రాను మేఘా నిర్మించింది.

ఎంఈఐఎల్‌ కాళేశ్వరంలో భారీ విద్యుత్‌ సబ్‌ స్టేషన్ల నిర్మాణం – ట్రాన్స్‌ మిషన్ల లైన్ల ఏర్పాట్లలో మరో రికార్డ్‌ ను సొంతం చేసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ మొత్తం 5159 మెగావాట్ల విద్యుత్ అంటే అంతే పంపింగ్ సామర్థ్యం మిషన్లు అవసరంకాగా అందులో ఎంఈఐఎల్‌ 4439 మెగావాట్ల విద్యుత్ అంటే అంత సామర్థ్య పంపింగ్ తో పాటు విద్యుత్‌ సరఫరా చేసే 6 సబ్‌ స్టేషన్లు, వాటి లైన్ల నిర్మించింది. సకాలంలో పూర్తి చేసి తన సామర్థ్యాన్ని చాటుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమైన పంప్‌లు, మోటార్లను బీహెచ్‌ఈఎల్‌, ఆండ్రిజ్‌, జైమ్‌ లాంటి అంతర్జాతీయ సంస్థలు సమకూర్చాయి. ఇంతవరకూ ప్రపంచంలో ఒక పంపింగ్‌ కేంద్రంలో 17 మెషీన్లు ఏర్పాటు కావడం ఎక్కడా లేదు మేడిగడ్డలోనే మొట్టమొదటిది. లక్ష్మీ, సరస్వతి, పార్వతి పంపు హౌస్‌ లో ఒక్కొక్కటీ 40 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన 43 మెషీన్లను ఏర్పాటు చేశారు. లింక్‌-1లోని ఈ మూడు పంపుహౌస్‌ల కిందే 1720 మెగావాట్ల విద్యుత్‌ వినియోగించే విధంగా పంపులు మోటార్లు ఏర్పాటయ్యాయి. అన్నారం సరస్వతిలో 12 పంపింగ్‌ యూనిట్‌లు, సుందిళ్ళ పార్వతి పంపంగ్‌ కేంద్రంలో 14 యూనిట్లు అనతి కాలంలోనే పూర్తయ్యాయి. మొత్తం 43 మిషీన్లు వినియోగంలోకి వచ్చాయి.

అన్నిటికన్నా ప్రథానంగా ప్యాకేజీ 8లోని గాయత్రి భూగర్భ పంపింగ్‌ కేంద్రంలో 7 రోజుకి 2 టీఎంసీలు పంపు చేసే విధంగా 7 యూనిట్‌లు వినియోగంలోకి వచ్చాయి. ఇందులో ఒక్కొక్క యూనిట్‌ సామర్ధ్యం 139 మెగావాట్లు. ఇంత భారీస్థాయి పంపింగ్‌ కేంద్రం ప్రపంచంలో మరెక్కడా లేదు. ఈ కేంద్రంలో 973 మెగావాట్ల విద్యుత్‌ వియోగించే విధంగా పంపిగ్‌ సామర్ధ్యం ఉందంటే ఎంతపెద్దదో అర్ధమవుతోంది. ఆ తరువాత రంగనాయక సాగర్‌ లోని నాలుగు మెషీన్లను ఒక్కొక్కటి 135 మెగావాట్ల సామర్ధ్యంతో ఎంఇఐఎల్‌ ఏర్పాటు చేసింది. అన్నపూర్ణ పంప్‌హౌస్‌లో నాలుగు మెషీన్లు ఒక్కొక్కటి 106 మెగావాట్ల సామర్ధ్యంతో ఏర్పాటయ్యాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu