HomeTelugu News'ఇదం జగత్‌' టీజర్‌ను విడుదల చేసిన జగన్‌

‘ఇదం జగత్‌’ టీజర్‌ను విడుదల చేసిన జగన్‌

సుమంత్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఇదం జగత్‌’. అనిల్‌ శ్రీ కంఠం ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా అంజు కురియన్ హీరోయిన్‌గా పరిచయమవుతుంది.  జొన్నల గడ్డ పద్మావతి, గంగపట్నం శ్రీధర్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అంజు కురియన్‌, శివాజీ రాజా, ప్రియదర్శిని రామ్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం టీజర్‌ను మంగళవారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి విడుదల చేశారు.

10a 3

ఈ టీజర్‌లో ‘ఇదంతా ఎందుకు షూట్‌ చేశావ్‌’ అని ఓ వ్యక్తి సుమంత్‌ను ప్రశ్నించగా.. ‘సర్‌.. ఇక్కడ మనిషి చావు న్యూసే, మనిషి జ్ఞాపకాలు న్యూసే, ప్రేమ న్యూసే, స్నేహం న్యూసే. చేయాలి అనుకుంటే ప్రపంచంలో ప్రతిదీ న్యూసే. అవసరమైతే ఆ న్యూస్‌ క్రియేట్‌ చేయడం కూడా తెలిసుండాలి.. అది నాకు తెలుసు’ అని ఆయన చెప్పే డైలాగ్‌ ఆకట్టుకుంది.శ్రీ చరణ్‌ పాకాల బాణీలు అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం చిత్ర పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి.

10 16

Recent Articles English

Gallery

Recent Articles Telugu