HomeTelugu Newsఎన్టీఆర్ చిత్రానికి అరుదైన గౌరవం

ఎన్టీఆర్ చిత్రానికి అరుదైన గౌరవం

జూనియర్ ఎన్టీఆర్ నటించిన “జైలవకుశ” చిత్రానికి అరుదైన గౌరవం దక్కింది. ఎన్టీఆర్‌ తొలిసారి త్రిపాత్రాభినయం చేసిన సినిమా ఇది. రాశీఖన్నా, నివేదా థామస్‌ హీరోయిన్లు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకంపై కల్యాణ్‌రామ్‌ నిర్మించిన ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహించారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు అందించారు. దక్షిణ కొరియాలో జరిగే (బుచాన్‌ ఇం టర్నేషనల్‌ ఫెంటాస్టిక్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్) చిత్రోత్సవంలో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ చిత్రోత్సవంలో ప్రదర్శితమైన తొలి తెలుగు సినిమా ఇదే. ఉత్తమ ఆసియా చిత్రాల విభాగంలో దీన్ని ప్రదర్శించారు.

5 21

ఈ సందర్భంగా చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేస్తోంది. గతేడాది సెప్టెంబరులో విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. బాక్సాఫీసు వద్ద మొత్తం రూ.128 కోట్లు వసూలు చేసినట్లు విశ్లేషకులు అంచనా. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్‌ త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘అరవింద సమేత’ చిత్రంలో నటిస్తున్నారు. ఈషా రెబ్బా ప్రధాన పాత్రలో కనిపించబోతుంది. ఎన్టీఆర్ సరసన పూజాహెగ్డే హీరోయిన్. మరోవైపు రాజమౌళి మల్టీస్టారర్ మూవీలోనూ నటించనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!