సూపర్స్టార్ కృష్ణ ‘గ్రీన్ ఇండియా’ ఛాలెంజ్లో భాగంగా మొక్కలు నాటారు. గ్రీన్ ఛాలెంజ్ను ప్రారంభించిన ఎంపీ సంతోష్ కుమార్ను అభినందించారు. త్వరలోనే గ్రీన్ ఛాలెంజ్ 10 కోట్లకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరు ఈ ఛాలెంజ్ను స్వీకరించి 3 మొక్కలు నాటాలని, వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన తమిళ సూపర్స్టార్ రజనీకాంత్, పవర్స్టార్ పవన్ కళ్యాణ్, విక్టరీ వెంకటేష్లకు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు. ఈ కార్యక్రమంలో కృష్ణతోపాటు రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్, నటుడు కాదంబరి కిరణ్ పాల్గొన్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు ఈ ఛాలెంజ్ను స్వీకరించారు. వీలైనన్ని మొక్కలు నాటి వాతావరణాన్ని రక్షించుకోవాలని అందర్నీ కోరారు.