HomeTelugu Big Storiesకేరళకు ఎ.ఆర్‌. రెహమాన్‌ భారీ విరాళం..!

కేరళకు ఎ.ఆర్‌. రెహమాన్‌ భారీ విరాళం..!

వరద భీభత్సానికి అతలాకుతలమైన కేరళ రాష్ట్రాన్ని ఆదుకునేందుకు ఇప్పటికే చాలా మంది సినీ, రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులు, సామాన్యులు ముందుకు వచ్చి ధన, వస్తు రూపంలో సహాయ సహకారాలు అందించగా ఇంకా ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండుకు విరాళాలు అందుతూనే ఉన్నాయి. తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్‌. రెహమాన్‌ కేరళకు భారీ విరాళం అందించారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్‌ ద్వారా తెలిపారు. తమ బృందంతో కలిసి కోటి రూపాయలను కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ఇచ్చినట్లు పేర్కొన్నారు. రెహమాన్‌ ఆదివారం తన బృందంతో కలిసి అమెరికాలో సంగీత విభావరి నిర్వహించారు. ఈ సందర్భంగా కేరళకు సాయం అందిస్తున్న విషయాన్ని వేదికపై ప్రకటించారు. ‘నేను, నా ఆర్టిస్టులు అమెరికా టూర్‌లో పాల్గొన్నాం. కేరళ సోదర సోదరీమణుల కోసం మా వంతు సాయం చేశాం. ఈ చిన్న విరాళం మీకు కాస్త ఊరట‌ ఇస్తుందని ఆశిస్తున్నాం’ అని రెహమాన్‌ ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా చెక్‌తో కలిసి దిగిన ఫొటోను షేర్‌ చేశారు.

2 2

ఈ టూర్‌లో భాగంగా ఇటీవల రెహమాన్‌ కేరళ వరద బాధితులను ఉద్దేశించి పాట పాడారు. ‘కేరళ, కేరళ, డోన్ట్‌ వర్రీ కేరళ’ అంటూ ఆ రాష్ట్ర ప్రజలకు ధైర్యం చెబుతూ పాడిన పాటకు మంచి స్పందన లభించింది. ఈ టూర్‌ పూర్తి చేసుకుని సెప్టెంబరులో రెహమాన్‌ భారత్‌ తిరిగి రానున్నారట. మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న ‘నవాబ్‌’ సినిమా ప్రచారంలో పాల్గొననున్నట్లు సమాచారం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu