HomeTelugu Newsగీత గోవిందంపై మహేశ్‌ స్పందన

గీత గోవిందంపై మహేశ్‌ స్పందన

విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన చిత్రం ‘గీత గోవిందం’ ఈ చిత్రం బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా ఈ సినిమాకు అభిమానుల నుంచే కాకుండా సినీ ప్రముఖుల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. బుధవారం రాత్రి ఈ సినిమాను సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు తన కుటుంబంతో కలిసి ఈ చిత్రాని వీక్షించారట. సినిమా చాలా అద్భుతంగా ఉందంటూ ఆయన ట్విటర్ ద్వారా వెల్లడించారు.

5 15

‘గీత గోవిందం విజయం సాధించింది. చాలా ఎంజాయ్‌ చేశాను. విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన అద్భుతంగా నటించారు. సుబ్బరాజు, వెన్నెల కిశోర్‌ల పాత్రల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చిత్ర బృందానికి శుభాకాంక్షలు’ అని పేర్కొన్నారు. దీన్ని వెన్నెల కిషోర్ రీట్వీట్‌ చేస్తూ.. మహేష్‌కు ధన్యవాదాలు తెలిపాడు‌. ఈ చిత్రానికి పరశురాం దర్శకత్వం వహించారు. గీత ఆర్ట్స్‌ బ్యానర్‌పై అల్లు అరవింద్‌, బన్నీ వాసు నిర్మాతలుగా వ్యవహరించారు. గోపీ సుందర్‌ బాణీలు అందించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!