జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రజాపోరాట యాత్రలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఇవాళ భీమవరంలోని రూపాంతర దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ‘తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు’ అనే వ్యాఖ్యాన్ని తాను నమ్ముతానని, ఆచరిస్తానని చెప్పారు. సర్వ మతాలనూ గౌరవిస్తానని చెప్పిన పవన్.. బైబిల్ నుంచి చాలా నేర్చుకున్నాను అన్నారు. తన కుమార్తెకు ఓ చర్చిలోనే నామకరణం చేశానని పవన్ చెప్పారు.