HomeTelugu Newsవారిద్దరి కోసం ఆ 21 రోజులు

వారిద్దరి కోసం ఆ 21 రోజులు

కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మలకు పెళ్లయ్యాక క్షణం తీరిక లేకుండాపోయింది. ఇద్దరూ కలిసి కొన్ని రోజులు హనీమూన్‌ యాత్ర చేసుకుని తిరిగి ముంబై వచ్చేశారు. ఆ తర్వాత విరాట్‌ వరుస మ్యాచ్‌లతో బిజీగా ఉంటే.. మరోపక్క అనుష్క తన సినిమా షూటింగ్‌లతో తీరిక లేకుండా గడుపుతున్నారు. దాంతో ఒకరికొకరు సమయం కేటాయించుకోలేకపోతున్నారట. ఈ విషయంలో అనుష్క శర్మ, కోహ్లీ జంట ఓ నిర్ణయానికి వచ్చింది. ఏడాదిలో 21 రోజుల పాటు ఇద్దరూ ఒకరికోసం ఒకరు సమయం కేటాయించుకోవాలని అనుకుంటున్నారట. ఏడాదిలో 21 రోజుల పాటు ఎలాంటి పనులు పెట్టుకోకూడదని నిర్ణయించుకున్నారట. దీంతో ఒకరికొకరు సమయం కేటాయించుకోవచ్చని భావిస్తున్నారట.

4 19

కోహ్లీ ఈ మధ్యనే బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో ఫిట్‌నెస్‌ పరీక్ష పూర్తిచేశాడు. మెడకు గాయంతో విశ్రాంతిలో ఉన్నాడు కోహ్లీ. జూన్‌ చివరి వారంలో ఐర్లాండ్‌తో జరిగే రెండు టీ-20 మ్యాచ్‌లలో కోహ్లీసేన తలపడబోతుంది. ఈ మ్యాచ్‌ల కోసం విరాట్‌తో పాటు అనుష్క కూడా వెళ్లనుందట. ఆ తర్వాత అనుష్క తను నటిస్తున్న ‘జీరో’ సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu