HomeTelugu News'వీర భోగ వసంత రాయలు' టీజర్‌

‘వీర భోగ వసంత రాయలు’ టీజర్‌

నారా రోహిత్, శ్రియ, సుధీర్ బాబు, శ్రీ విష్ణు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘వీర భోగ వసంత రాయలు’. ‘కల్ట్ ఈజ్ రైసింగ్’ అనేది ఉపశీర్షిక. ఈ సినిమాకు ఇంద్రసేన దర్శకత్వం వహిస్తున్నారు. బాబా క్రియేషన్స్ పతాకంపై అప్పారావు బెళ్లన నిర్మిస్తున్న ఈ చిత్రానికి మార్క్‌ కె రాబిన్‌ సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ రోజు (ఆదివారం) ఈ
సినిమా టీజర్‌ను విడుదల చేశారు.

12 12

‘నాకు తెలుసు మీరు వాళ్ల రాక కోసం ఎన్ని పూజలు, ప్రార్థనలు చేస్తున్నారో అని.. నాకు తెలుసు మీరు వాళ్లు ఎలాగైనా వస్తారని ఎంత ఆశగా ఎదురుచూస్తున్నారో అని.. ఎందుకంటే మీలాగా ఎదురు చూసే వాళ్లలో నేనూ ఒకడ్ని కాబట్టి.. ఎదురు చూశాం, ఎదురు చూశాం. క్షణాలు కాదు, నిమిషాలు కాదు, గంటలు కాదు, రోజులు కాదు.. నెలల తరబడి ఎదురుచూశాం. కానీ, వాళ్లు మాత్రం తిరిగి రాలేదు.. కాబట్టి ఇవాళ మనం మౌనం వీడాలి..’ అనే పవర్‌ఫుల్‌ డైలాగ్‌ చెబుతూ నారా రోహిత్‌ కనిపించారు.

నారా రోహిత్‌ ఓ స్టేజ్‌ పై నిల్చుని చెప్పే ఈ మాటల్ని దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలు వివిధ మాధ్యమాల ద్వారా వింటున్నట్లు చూపించారు. చివర్లో యాక్షన్‌ సన్నివేశాల్ని టీజర్‌కు జోడించారు. కుప్పగా పడి ఉన్న మనుషుల తలలు చూస్తుంటే.. ఈ చిత్రం క్రైమ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!