HomeTelugu Newsవైసీపీలో చేరిన నటుడు కృష్ణుడు

వైసీపీలో చేరిన నటుడు కృష్ణుడు

వైసినీ సీనియర్ నేత పెన్మెత్స సాంబశివరావు మనవడు, సినీ నటుడు కృష్ణుడు(వినాయకుడు ఫేం హీరో) వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం కత్తిపూడిలో పాదయాత్రలో ఉన్న వైఎస్ జగన్ సమక్షంలో నటుడు కృష్ణుడు వైసీపీలో చేరారు. ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర నేటితో 230 రోజులు పూర్తి చేసుకుంది.

11 3

వైఎస్సార్‌సీపీలో చేరిన అనంతరం కృష్ణుడు మాట్లాడుతూ.. వైఎస్ జగన్ నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజల కోసం తపన పడే విధానం తనకు నచ్చిందని అన్నాడు. ప్రజల కోసం ఎండలను సైతం లెక్కచేయక పాదయాత్ర చేస్తూ ప్రజా సమస్యలు తెలుసుకోవడం తనను ఆకర్షించిందని అన్నారు. జగన్ తన పాదయాత్రతో అన్ని వర్గాలను ఆకట్టుకున్నారని అన్నారు. బహుశ దేశ రాజకీయాల్లో ఇలాంటి నేత ఎవరూ లేరేమో అన్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతూ నిరంతరం ప్రజల్లో ఉంటూ రాష్ట్ర మంతటా పర్యటించడం మామూలు విషయంకాదని అన్నారు. వైసీపీలో తాను ఓ సామాన్య కార్యకర్తగా పనిచేస్తానని హీరో కృష్ణుడు అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu