టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్, రష్మికా మందన్న జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’. కిశోర్ తిరుమల డైరెక్షన్లో తెరకెక్కిన ఈచిత్రంలో ఖుష్బూ, రాధిక, ఊర్వశి లాంటి సీనియర్ నటీమణులు నటించారు. ఆదివారం ఈ సినిమా ట్రైలర్ విడులైంది. ఇందులో హీరో శర్వానంద్ వరుసగా పెళ్లి చూపులకు వెళ్తూ ఉంటాడు. కానీ అతడి ఫ్యామిలీలో ఉన్న ఆడవాల్లకు పిల్ల నచ్చకపోవడంతో అవి రిజెక్ట్ అవుతూ ఉంటాయి.
ఈ ట్రైలర్లో బ్రహ్మానందం కూడా కనిపించాడు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమా మార్చి 4న విడుదలకానుంది. కుటుంబ విలువలు, బంధాల నేపథ్యంలో తెరకెక్కిన్నారు.