HomeTelugu Big Storiesమరోసారి కలిసి నటిస్తోన్న నారారోహిత్, విష్ణు!

మరోసారి కలిసి నటిస్తోన్న నారారోహిత్, విష్ణు!

2016 చివ‌ర‌లో విడుదలై సినీప్రేక్ష‌కుల్ని, విమ‌ర్శ‌కుల‌ని సైతం మ‌న‌సుతో కంట‌త‌డి పెట్టించిన వినూత్న‌క‌థా చిత్రం అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు. ఈ చిత్రంలో నారారోహిత్‌, శ్రీవిష్ణు క‌ల‌సి న‌టించారు. వైవిధ్య‌మైన చిత్రాల‌తో ఎప్పుడూ ప్రేక్ష‌కుల్ని అల‌రించేదిశ‌గా త‌మ సినీ ప్ర‌యాణం సాగిస్తున్న వీరిద్దరూ… మరోసారి కలిసి నటిస్తున్న చిత్రం వీర భోగ వసంత రాయ‌లు.. ఈ చిత్ర టైటిల్లోనే వైవిధ్యం క‌నిపిస్తుంది. ఈ చిత్రాన్నిబాబా క్రియేష‌న్స్ ప‌తాకంపై, ఎంవికె రెడ్డి గారి సమర్పణలో అప్పారావు బెల్ల‌న నిర్మిస్తున్నారు. అలాగే న్యూ వేవ్ డైరెక్టర్ ఇంద్ర‌సేన‌.ఆర్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేని ఈ వినూత్న కథా చిత్రంలో ఎప్ప‌టికి చెక్కుచెర‌గ‌ని గ్లామ‌ర్ తో అల‌రించే శ్రియా శ‌ర‌ణ్ మ‌రో ముఖ్య‌ పాత్ర‌లో న‌టిస్తుండగా… జ్యోతిల‌క్ష్మి ఫేం సత్యదేవ్ మ‌రో కీలక పాత్ర‌లో న‌టిస్తున్నాడు.  
నిర్మాత అప్పారావు బెల్ల‌న మాట్లాడుతూ.. ”ఎప్ప‌టిక‌ప్పుడు క‌మ‌ర్షియాలిటి మిస్ కాకుండా వైవిధ్య‌మైన క‌థ‌లు, పాత్ర‌లు చేస్తూ ప్రేక్ష‌కుల్ని అల‌రించే రోహిత్ గారు, శ్రీ విష్ణు గారు అంగీకరించేస‌రికి ఈ ప్రాజెక్ట్  మీద మాకు రెస్పాన్సిబిలిటీ  మరింత పెరిగింది. శ్రియా గారు కథ విని చాలా ఎక్సైట్ అయ్యి అంగీక‌రించారు. అలానే స‌త్య‌దేవ్ ని తీసుకున్నాము. ఈ నాలుగు పాత్ర‌లు వీరి పాత్ర‌ తీరుని భిన్నంగా ఇద్ర‌సేన తీర్చిదిద్దాడు. ఈ మే రెండ‌వ వారం నుండి సెట్స్ మీద‌కి వెళ్ళ‌నుంది. మిగ‌తా వివ‌రాలు అతిత్వ‌ర‌లో తెలియ‌జేస్తాం” అని అన్నారు 
ద‌ర్శ‌కుడు ఇంద్ర‌సేన.ఆర్ మాట్లాడుతూ.. ”ఇది సొసైటీలో జరిగే గ్రే అండ్ డార్క్ సైడ్ లను టచ్ చేసే వినూత్నమైన మల్టీస్టారర్ స్టోరీ. నాన్ లీనియర్ క్రైం థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నాం” అని అన్నారు. 

Recent Articles English

Gallery

Recent Articles Telugu