మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ డైరెక్షన్లో ‘ఆచార్య’ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమాలో హీరోయిన్గా కాజల్ నటిస్తుండగా, రామ్ చరణ్ ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్నాడు. ‘ఉగాది’ కానుకగా ఈ సినిమా నుంచి ఫస్టులుక్ పోస్టర్ వస్తుందని మెగా అభిమానులు భావిస్తున్నారు. అలా నిరీక్షించినవారికి నిరాశే ఎదురైంది.
అయితే ‘శ్రీరామనవమి’ సందర్భంగా ఈ మూవీ ఫస్టులుక్ ను రిలీజ్ చేసే ఆలోచనలో కొరటాల ఉన్నట్లు తెలుస్తుంది. దానిపై సన్నాహాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. ఏప్రిల్ 2 వ తేదీకి ఫస్టులుక్ ను విడుదల చేసే పనిలోనే కొరటాల వున్నాడని అంటున్నారు. చిరంజీవి డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడనే టాక్ వినిపించిన దగ్గర నుంచి, ఆయన ఫస్టులుక్ కోసం ఫ్యాన్స్ చాలా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.