HomeTelugu Trendingరేసుగుర్రం విలన్‌ పీఏ కు కరోనా

రేసుగుర్రం విలన్‌ పీఏ కు కరోనా

ravi kishan ap corona
అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘రేసుగుర్రం’ సినిమా విలన్‌ ‘మద్దాలి శివారెడ్డి’ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రవికిషన్. ఈయన కేవలం నటుడిగా మాత్రమే కాకుండా బీజేపీ ఎంపీగా రాజకీయాల్లో కూడా బాగానే రాణిస్తున్నారు. ఇక ప్రస్తుతం మన ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా ఈయన ఇంట్లో కూడా కలకలం రేపింది. రవికిషన్ పీఏ కు కరోనా సోకింది. ఈ విషయాన్నిఆయనే స్వయంగా వెల్లడించారు. ‘నా దగ్గర పని చేస్తున్న పీఏ గుడ్డూ పాండే(42) కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దాంతో అనుమానం వచ్చి వైద్య పరీక్షలు చేయగా, అతనికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో అతనిని ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నాను’ అని పేర్కొన్నారు. ఇక తన పీఏ కు కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిన వెంటనే రవికిషన్‌ కూడా కరోనా టెస్ట్‌లు చేయించుకొని హోమ్ క్వారంటైన్‌కి వెళ్ళారు. అలాగే తన నియోజకవర్గం లోని ప్రజలు మాస్కులు తప్పకుండ ధరించాలని, సామాజిక దూరాన్ని పాటించాలని పేర్కొన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu