HomeTelugu Trendingఅమితాబ్ కుటుంబంపై కరోనా పంజా..ఐశ్వర్య రాయ్ కు పాజిటివ్

అమితాబ్ కుటుంబంపై కరోనా పంజా..ఐశ్వర్య రాయ్ కు పాజిటివ్

2 11మాజీ విశ్వసుందరి, బాలీవుడ్‌ నటి ఐశ్వర్యరాయ్ బచ్చన్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ జరిగినట్టు తెలుస్తోంది. నిన్న బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ కు కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. బిగ్ బీకి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే అయన కుమారుడు అభిషేక్ బచ్చన్ కు కూడా కరోనా సోకినట్టు నిర్ధారణ జరిగింది. వీరిద్దరూ నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

అభిషేక్ బచ్చన్ తో పాటు, ఐశ్వర్య రాయ్ బచ్చన్, జయా బచ్చన్, ఐష్ కూతురు ఆరాధ్య బచ్చన్‌లకు కూడా నిన్న టెస్టులు నిర్వహించారు. ఐశ్వర్యరాయ్ బచ్చన్, ఆరాధ్య బచ్చన్ కు సంబంధించిన ఫలితాలు ఈరోజు వచ్చాయి. ఈ ఫలితాల్లో ఐశ్వర్య రాయ్ బచ్చన్, ఆరాధ్య బచ్చన్ కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ జరిగింది. ఇప్పటికే అమితాబ్ ఇల్లు జల్సాను కంటైన్మెంట్ జోన్ గా ప్రకటించి భారీగేట్లు పెట్టారు. బాలీవుడ్ కు చెందిన ప్రముఖులకు వరసగా కరోనా వైరస్ సోకుతుండటంతో స్టార్ నటీనటులు అప్రమత్తం అయ్యారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu