HomeTelugu Trendingకరోనాతో బాలీవుడ్‌ నటి మృతి

కరోనాతో బాలీవుడ్‌ నటి మృతి

Actress divya bhatnagar pas
కరోనా కారణంగా ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ నేతలు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. తాజాగా బాలీవుడ్‌ టీవీ నటి దివ్య భట్నాగర్‌(34) సోమవారం మృతి చెందారు. ఇటీవల కరోనా బారిన పడిన ఆమె ముంబైలోని సెవెన్‌హిల్స్‌ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ తెల్లవారు జామున ఆమె పరిస్థితి విషమించడంతో వైద్యులు ఆమెకు వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. అధిక రక్తపోటుతో పాటు కరోనా మహమ్మారితో పోరాడి ఈ రోజు తుది శ్వాస విడిచారు దివ్య. ఆమె మరణవార్తతో పలువురు టీవీ ప్రముఖులు దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తూ సోషల్‌ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu