HomeTelugu Trendingసైబర్‌ పోలీసులను ఆశ్రయించిన పవిత్రా లోకేశ్‌

సైబర్‌ పోలీసులను ఆశ్రయించిన పవిత్రా లోకేశ్‌

Actress pavitra lokesh file
సినీ నటి పవిత్రా లోకేశ్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించింది. సీనియర్‌ నటుడు నరేశ్‌పై, తనపై సోషల్‌ మీడియాలో వస్తున్న అభ్యంతర కామెంట్లపై ఫిర్యాదు చేసింది. ఫొటోలు మార్ఫింగ్‌ చేసి వైరల్‌ చేస్తున్నారని పలు వెబ్‌సైట్స్‌, యూట్యూబ్‌ ఛానళ్లపై ఫిర్యాదు చేసింది.

కొద్దిరోజులుగా సీనియర్‌ నటుడు నరేశ్‌, పవిత్రా లోకేశ్‌ వ్యవహారం ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని అప్పట్లో వార్తలు రావడం పెద్ద దుమారం లేపింది. మైసూర్‌లోని ఓ హోటల్‌లో ఇద్దరూ కలిసి ఉండగా.. నరేశ్‌ మాజీ భార్య రమ్య రఘుపతి వారిని పట్టుకున్న వీడియో కూడా వైరల్‌గా మారింది. ఆ తర్వాత తాము పెళ్లి చేసుకోలేదని ప్రకటించిన తర్వాత వివాదం కొంతవరకు సద్దుమణిగింది. కానీ తాజాగా సూపర్‌ స్టార్‌ కృష్ణ అంత్యక్రియల సమయంలో నరేశ్‌ పవిత్ర జంట చాలా హైలెట్‌ అయ్యింది. ఆ సమయంలో నరేశ్‌ కాస్త అతిగా ప్రవర్తించడంటూ చాలామంది అభిప్రాయపడ్డారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ క్రమంలోనే కొన్ని యూట్యూబ్‌ ఛానళ్లు, పలు వెబ్‌సైట్లు అసభ్యకర పోస్టులు పెట్టడంతో పవిత్రా లోకేశ్‌ సీరియస్‌ అయ్యింది. సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పవిత్రా లోకేశ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ వెల్లడించారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu