HomeTelugu Trendingఆసుపత్రిలో చేరిన యంగ్‌ హీరో

ఆసుపత్రిలో చేరిన యంగ్‌ హీరో

 

Adivi sesh infected with de

టాలీవుడ్‌ యంగ్‌ హీరో అడివి శేష్‌ అనారోగ్యానికి గురయ్యారు. ఇటీవల డెంగీ బారినపడిన ఆయన రక్తంలో ప్లేట్లెట్స్‌ పడిపోవడంతో సెప్టెంబర్‌ 18న ఆస్పత్రిలో చేరారు. ఈ విషయాన్ని తాజాగా ఆయన టీమ్‌ వెల్లడించింది. ప్రస్తుతం శేష్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని.. పలువురు వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని తెలిపింది. ఆయన త్వరితగతిన కోలుకోవాలంటూ నెటిజన్లు ట్వీట్లు పెడుతున్నారు.

‘గూఢచారి’, ‘ఎవరు’ వంటి సస్పెన్స్‌ థ్రిల్లర్లతో ప్రేక్షకుల్ని అలరించిన శేష్‌ ప్రస్తుతం ‘మేజర్‌’ చిత్రీకరణ పనుల్లో ఫుల్‌ బిజీగా ఉంటున్నారు. ముంబయి ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వీరజవాన్‌ మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితాన్ని ఆధారంగా చేసుకుని ‘మేజర్‌’ రూపొందిస్తున్నారు. శశికిరణ్‌ తిక్కా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. దీనితోపాటు ‘హిట్‌-2’లోనూ శేష్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. దీని తర్వాత ‘గూఢచారి2’లోనూ ఆయన నటించనున్నారు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu