2018లో వచ్చిన నెట్ ఫ్లిక్స్ లస్ట్ స్టోరీస్ పై సినీ వర్గాల్లో చాలా చర్చ జరిగింది. హిందీలో విజయవంతమైన వెబ్ సిరీస్ ‘లస్ట్ స్టోరీస్’ ను తెలుగులో రీమేక్ చేయబోతున్నారు. ఇందులో కియారా అద్వానీ, రాధికా ఆప్టే, భూమి ఫడ్నేకర్, మనీషా కొయిరాలా కీలక పాత్రలు పోషించారు. నాలుగు భాగాలుగా రూపొందిన లస్ట్ స్టోరీస్ కు కరణ్ జోహార్, జోయా అక్తర్, అనురాగ్ కశ్యప్, దివాకర్ బెనర్జీ దర్శకత్వం వహించారు. ముందుగా మొదటి భాగాన్ని తెలుగులో రీమేక్ చేయబోతున్నారు. ‘ఆమె’ సినిమాతో విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకున్న అమలాపాల్ ఇందులో ఓ కీలక పాత్ర చేయబోతుంది. హిందీలో కియారా చేసిన పాత్రను తెలుగులో అమలాపాల్ చేయబోతున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అంతే కాకుండా ఈ లస్ట్ స్టోరీస్లో జగపతిబాబు కూడా మరో కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. తెలుగులో లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ను రోనీ స్క్రూవాలా నిర్మించనున్నారు.