HomeTelugu Big Stories'భారత్ మాతాకీ జై' అమితాబ్‌ ట్వీట్‌ వైరల్‌

‘భారత్ మాతాకీ జై’ అమితాబ్‌ ట్వీట్‌ వైరల్‌

amitabh bachchan bharat matamitabh bachchan bharat mat
జీ-20 విందు కోసం రాష్ట్రపతి భవన్ పంపిన ఆహ్వాన పత్రికల్లో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ఉండటంపై వివాదం రాజుకుంది. ఈ క్రమంలో దేశం పేరును త్వరలో ఇండియా నుండి భారత్‌గా మార్చనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

రాజ్యాంగాన్ని సవరించి ఈ మేరకు తీర్మానం చేయవచ్చునని అంటున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ చేసిన ట్వీట్ ఆసక్తికర చర్చకు దారి తీసింది. కేంద్ర ప్రభుత్వం ఇండియా పేరును భారత్‌గా మార్చనుందనే ప్రచారం సాగుతోన్న నేపధ్యంలో అమితాబ్ ‘భారత్ మాతాకీ జై’ అని ట్వీట్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఈ మేరకు సోషల్ మీడియా అనుసంధాన వేదిక ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనే చోట ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ఉపయోగించడం ఇదే మొదటిసారి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu