HomeTelugu Big Storiesకరోనాపై అమితాబ్, ప్రియాంక ఏమన్నారంటే..!

కరోనాపై అమితాబ్, ప్రియాంక ఏమన్నారంటే..!

3 12
ప్రపంచ దేశాలను వణికిస్తున్న మహమ్మారి కరోనా ఇప్పటికే వేలాదిమంది ప్రాణాలు తీసింది. దీని బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అటు ప్రభుత్వాలు , ఇటు వైద్య నిపుణులు అవగాహన కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. సెలబ్రిటీలు సైతం తమ వంతు బాధ్యతగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు . బాలీవుడ్ స్టార్ అమితాబ్ కరోనాపై ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా బారిన పడకుండా ఉండేలా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. తాను స్వయంగా రాసిన ఓ కవితను వినిపిస్తున్న ఓ వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేశారు. చేతులు శుభ్రంగా ఉంచుకోవడంతోపాటు ఉసిరి, కలోంజి రసాలను సేవించాలని అమితాబ్ సూచించారు.

కరోనాపై మరో బాలీవుడ్ నటి తమవంతు బాధ్యతగా అవగాహన కార్యక్రమంలో పాల్గొంది. ప్రియాంక చోప్రా కూడా కరోనా నుంచి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఇన్‌స్టాగ్రామ్ లో ఇందుకు సంబంధించి ఓ పోస్ట్ ను పెట్టింది ప్రియాంక. ప్రజలు ఎదుటివారిని పలకరించేటప్పుడు జాగ్రత్తలు వహించాలని సూచించింది. వీలైనంత వరకు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడమే మంచిదని నమస్కారం పెడుతూ ఉన్న ఫొటోలను పోస్ట్ చేసింది. ఇలా అమితాబ్ కవిత రూపంలో, ప్రియాంక ఫోటో రూపంలో ప్రజల్లో కరోనాపై అవగాహన తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu