HomeTelugu Big Storiesఅనసూయకు అరుదైన గౌరవం

అనసూయకు అరుదైన గౌరవం

Anasuya gets her own postag
చిత్రపురి ఫిల్మ్ ఫెస్టివల్ ఈ సంవత్సరం మహిళా దినోత్సవం సందర్భంగా స్పూర్తిని నింపే ఎంతో మంది మహిళల ఘనతకు సంబంధించిన కథలను వెల్లడించనుంది. ఈ నేపధ్యంలో తెలుగు బుల్లితెర యాంకర్‌ అనసూయ భరద్వాజ్‌కు అరుదైన గౌరవం లభించింది. ‘తెలంగాణ చిత్రపురి ఫిల్మ్‌ ఫెస్టివల్‌’ ఆమె తన సొంత పోస్టల్ స్టాంప్‌తో సత్కరించింది. అంతేగాక అనసూయ ఫొటోకి ఎర్రకోటని జోడించడం విశేషం. ఈ విషయాన్ని స్వయంగా అనసూయ సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా అనసూయ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ చిత్రపురికి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఆ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ.. ‘జీవితంలో అంతకు మించిన గౌరవం ఏం ఉంటుంది. నా సొంత పోస్టల్ స్టాంపులు. ఇందుకు అర్హురాలు అయ్యేందుకు నేనేం చేశానో నాకు తెలీదు. చిత్రపురి ఫిల్మ్ ఫెస్టివల్ !! ఈ విలాసానికి ముందే నేను మీ గురించి గర్వపడుతున్నాను. ప్రోత్సహించడానికి మీరు చేస్తున్న గొప్ప ప్రయత్నమిది. మీరు చేస్తున్న గొప్ప పనుల కోసం నేను చేయగలిగినదంతా చేస్తానని మాటిస్తున్నాను’ అని ఉద్వేగానికి లోనయ్యారు అనసూయ.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu