HomeTelugu Big Storiesఏపీలో 111కి చేరిన కరోనా కేసులు

ఏపీలో 111కి చేరిన కరోనా కేసులు

15
ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు 111కి పెరిగాయి. ఈ మేరకు ఏపీ ఆరోగ్య శాఖ బుధవారం సాయంత్రం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఇవాళ నిర్వహించిన పరీక్షల్లో 24 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇవాళ ఒక్కరోజే 67 కొత్త కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారితోనే రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోందని సీఎం జగన్ వెల్లడించారు. ఇప్పటి వరకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం అత్యధికంగా గుంటూరులో 20 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కడప- 15, ప్రకాశం- 15, కృష్ణా-15, ప.గో. 14, విశాఖ 11, తూ.గో 9, చిత్తూరు 6, నెల్లూరు 3, అనంతపురం 2, కర్నూలులో ఒక్కరు కరోనా బాధితులున్నారు. ఇప్పటి వరకు నెల్లూరులో ఒకరు, విశాఖలో ఒకరు కరోనా బారినుంచి కోలుకున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!