HomeTelugu Newsచంద్రబాబుపై ఏపీ హోంమంత్రి ఆగ్రహం

చంద్రబాబుపై ఏపీ హోంమంత్రి ఆగ్రహం

12 3
టీడీపీ అధినేత చంద్రబాబు అనవసరంగా రైతులను రెచ్చగొడుతున్నారని ఏపీ హోం మంత్రి సుచరిత మండిపడ్డారు. ‘ర్యాలీ గురించి పోలీసులు పర్మిషన్ ఇచ్చిన రూట్ మ్యాప్ ఇచ్చారు. ఆ రూట్ మ్యాప్ కాకుండా వేరే రూట్ లో వెళ్లాలని టీడీపీ నేతలు ప్రయత్నించారు. అలజడి సృష్టించి ప్రజల్లో భయానక వాతావరణం కల్పించాలని ఇలా చేశారు అన్నారు. రాజధాని ఏర్పాటు చేసినప్పుడు చంద్రబాబు అఖిలపక్ష నిర్ణయం తీసుకోలేదని ఆరోపించారు. రైతుల భూములను అభివృద్ధి చేస్తామని, అన్ని ప్రాంతాలు బాగుపడాలని.. రాజధాని విషయంలో ఇంకా పూర్తి నిర్ణయం తీసుకోలేదని హోంమంత్రి తెలిపారు. ఏయే కార్యాలయాలను ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై చర్చిస్తున్నట్లు తెలిపారు. అమరావతిలో ఆందోళనలు జరుగుతున్న సమయంలో చనిపోయినవారంతా గుండెపోటుతోనే మరణించినట్లు ఆధారాలున్నాయని హోం మంత్రి
సుచరిత అన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu