HomeTelugu Newsఏపీలో మరో 48 కరోనా పాజిటివ్ కేసులు

ఏపీలో మరో 48 కరోనా పాజిటివ్ కేసులు

2 15
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా బాధితుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. గత 24 గంటల్లో కొత్తగా 48 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. తాజాగా కర్నూలు జిల్లాలో ఒకరు మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 2205కి చేరింది. కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 49 కి చేరింది. కరోనా నుంచి కోలుకుని ఇప్పటి వరకు 1353 మంది డిశ్చార్జి కాగా, 803 మంది చికిత్సపొందుతున్నారు. ఇవాళ కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో 31 కేసులు కోయంబేడు మార్కెట్ లింకులేనని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.

కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో నెల్లూరు 9, గుంటూరు 9, కర్నూలు 9, చిత్తూరు 8, కృష్ణా 7, విశాఖ 4, కడప, ప.గో. జిల్లాల్లో ఒక్కో పాజిటివ్ కేసు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 9,628 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 48 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి కరోనా బారిన పడినవారు ఏపీలో 150 మంది ఉన్నారు. వీటిని అధికారులు బులెటిన్‌లో విడిగా చూపుతున్నారు. మహారాష్ట్రకు చెందిన 101, గుజరాత్ 26, రాజస్థాన్ 11, ఒడిశా 10, కర్నాటక, పశ్చిమబెంగాల్‌కు చెందిన ఒక్కొక్కరికి కరోనా సోకింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu