ప్రస్తుతం బాలీవుడ్లో హాట్ టాపిక్ ఏదైనా ఉందా అంటే అది అర్జున్ కపూర్.. మల్లికా అరోరా గురించే. ఈ ఇద్దరు మీదనే బాలీవుడ్ మీడియా ఫోకస్ చేసింది. ఈ జంట ఎక్కడికి వెళ్తున్నారు.. ఎవరెవర్ని కలుస్తున్నారు.. ఏం చేస్తున్నారు అనే దానిచుట్టునే కథనాలు అల్లేందుకు ఎక్కువ ఆసక్తిచూపుతున్నారు. ఈ కథనాలనే నెటిజన్లు ఆసక్తిగా చదువుతున్నారు. న్యూ ఇయర్ రోజున ఈ జంట ఏం చేసిందనే దానిపైజ ఇప్పుడు ఆసక్తిగా మారింది.
న్యూ ఇయర్ సాయంత్రం అర్జున్ కపూర్, మల్లికా అరోరా జంట డిన్నర్ చేసేందుకు రెస్టారెంట్ కు వెళ్లారు. రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చే సమయంలో ఫ్యాన్స్ కారు చుట్టూ గుమికూడటంతో.. ఫ్యాన్స్ కు చేయి ఊపుతూ హాయ్ చెప్తూ.. న్యూ ఇయర్ విషెస్ చెప్పారు. చెట్టపట్టాలు వేసుకొని ముంబైలో తిరుగుతున్న ఈ జంట 2019లో ఒక్కటి కాబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
.@arjunk26 and #MalaikaArora wave out to fans after they stepped out for dinner last night. pic.twitter.com/pmkNylhOC5
— Filmfare (@filmfare) January 2, 2019