HomeTelugu Big Storiesపునర్నవిని ట్రోల్‌ చేయొద్దు : రాహుల్‌

పునర్నవిని ట్రోల్‌ చేయొద్దు : రాహుల్‌

1 26తెలుగు ‘బిగ్‌బాస్‌ సీజన్‌3’ రియాల్టీ షో.. విజేతగా సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ నిలిచిన సంగతిఇ తెలిసిందే. అయితే షో నుంచి రాహుల్‌- పునర్నవి ప్రేమలో ఉన్నారంటూ సోషల్‌మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో మేమిద్దరం మంచి స్నేహితులం మాత్రమే అంటూ రాహుల్‌ – పునర్నవి పలు సందర్భాల్లో తెలిపారు.

ఇటీవల వీరిద్దరు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా రాహుల్‌పై పునర్నవి సరదా వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలను మరోవిధంగా తీసుకున్న రాహుల్‌ అభిమానులు సోషల్‌మీడియా వేదికగా ఆమెపై ట్రోల్స్‌ చేయడం మొదలుపెట్టారు. దీంతో రాహుల్‌ – పునర్నవి కలిసి తాజాగా ఇన్‌స్టా లైవ్‌లో అభిమానులతో ముచ్చటించారు. పునర్నవిని ట్రోల్‌ చేయొద్దని రాహుల్‌ అభిమానులను కోరాడు. పునర్నవిని ఉద్దేశిస్తూ మీరు పెట్టే మెస్సేజ్‌ల వల్ల ఆమె కుటుంబం కూడా ఇబ్బందిపడుతోందని పేర్కొన్నారు. అంతేకాకుండా ఆమెను వ్యక్తిగతంగా కించపరిచే హక్కు ఎవరికీ లేదని తెలిపారు. పునర్నవి తనకు మంచి స్నేహితురాలేనని అన్నారు.

మరోవైపు ఈ నెల 29వ తేదీన రాహుల్‌ తన అభిమానుల కోసం ప్రత్యేకంగా ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. హైదరాబాద్‌లో నిర్వహించే ఈ కార్యక్రమానికి అందరూ హాజరుకావాలని కోరారు. దీనికి సంబంధించి ఓ స్పెషల్‌ వీడియోను కూడా ఆయన ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!