HomeTelugu Newsటొరంటోలో తమిళనాడు విద్యార్థినిపై కత్తితో దాడి

టొరంటోలో తమిళనాడు విద్యార్థినిపై కత్తితో దాడి

13 5

కెనడాలో భారత్‌కు చెందిన ఓ విద్యార్థినిపై దాడి ఘటన కలకలం రేపింది. తమిళనాడుకు చెందిన 23 ఏళ్ల రేచల్‌ ఆల్బర్ట్‌ అనే విద్యార్థినిపై టొరెంటోలో గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు రేచల్‌ కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆమె చావుతో పోరాడుతోందని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. అక్కడికి వెళ్లేందుకు వీసా మంజూరు చేయాలని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్‌ను కోరినట్లు ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యార్క్‌ యూనివర్సిటీలో మాస్టర్స్‌ డిగ్రీ చదువుతున్న రేచల్‌ రెండురోజుల క్రితం రాత్రి ఇంటికి వస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడిచేశాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలైన రేచల్‌ను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu