,
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా సంతోష్ శ్రీన్వాస్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతుంది. ఇందులో బెల్లంకొండకు జంటగా నభా నటేష్ కనిపించబోతుంది. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్లో జరిపారు. నిర్మాత దిల్ రాజ్, దర్శకుడు వి.వి.వినాయక్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముహూర్తపు షాట్కు వినాయక్ క్లాప్ కొట్టగా, దీనికి సంబంధించిన ఫొటోలను చిత్రబృందం సోషల్మీడియాలో అభిమానులకు షేర్ చేసింది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందిస్తున్నారు. ఇప్పటికే ‘రభస’, ‘హైపర్’ చిత్రాలతో మిశ్రమ ఫలితాలను అందుకున్న దర్శకుడు సంతోష్ శ్రీన్వాస్.. ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకోవాలని ఆశిస్తున్నారు. ఈ ఏడాది విడుదలైన ‘రాక్షసుడు’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నాడు నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్.