మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన తాజా చిత్రం ‘భోళా శంకర్’. రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమాకి మెహర్ రమేశ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్గా నటించగా.. చిరంజీవి చెల్లెలి పాత్రలో కీర్తి సురేశ్ కనిపించనుంది.
ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికను కూడా ఫిక్స్ చేశారు. హైదరాబాద్ లోని ‘శిల్పకళావేదిక’లో ఈ నెల 6వ తేదీన రాత్రి 7 గంటల నుంచి ఈ వేడుకను ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ అధికారిక పోస్టర్ ను విడుదల చేశారు. మహతి స్వరసాగర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.