HomeTelugu Trendingదేశంలో అత్యంత ధనవంతురాలు నాగలక్ష్మి: సోనూసూద్‌

దేశంలో అత్యంత ధనవంతురాలు నాగలక్ష్మి: సోనూసూద్‌

Blind girl nagalaxmi donate

కరోనా మహమ్మారి దేశంలో విజృంభిస్తున్న నేపధ్యంలో బాలీవుడ్ నటుడు సోనూ సూద్ ఇప్పుడు ఆపద్బాంధవుడయ్యాడు. సాయం కోసం ఆపన్నులు అర్థించిన వెంటనే నేనున్నాంటూ ముందుకొచ్చి అండగా నిలుస్తున్నాడు. ఇటీవల ఓ ఫౌండేషన్ స్థాపించిన సోనూసూద్ దాని ద్వారా తన సహాయ కార్యక్రమాలను మరింత విస్తృతం చేశాడు. తాజాగా ఆ ఫౌండేషన్‌కు నెల్లూరు జిల్లా వరికుంటపాడుకు చెందిన యూట్యూబర్, అంధ యువతి బొడ్డు నాగలక్ష్మి రూ. 15 వేలను విరాళంగా ఇచ్చి సోనూ సూద్ చేస్తున్న సాయంలో భాగస్వామి అయింది. ఇవి తన తన 5 నెలల పెన్షన్ డబ్బులు కావడం విశేషం. ఈ విషయాన్ని సోనూ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించాడు. ఓ చిన్న గ్రామానికి చెందిన నాగలక్ష్మి తన ఫౌండేషన్‌కు రూ. 15 వేలు విరాళం పంపిందని, తనవరకు ఈ దేశంలో అత్యంత ధనవంతురాలని ఆమేనని ప్రశంసలు కురిపించాడు. వేరొకరి బాధను చూడడానికి నేత్రాలు అవసరం లేదని పేర్కొన్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu