నటి పాయల్ రోహత్గి బాలీవుడ్ అనేక సినిమాలు నటించింది. ఇటీవలే వివాహం చేసుకొని అహ్మదాబాద్ లో ఉంటోంది. అయితే, ఈ అమ్మడు నెహ్రు కుటుంబం గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసింది. ఈ వీడియో వైరల్ కావడంతో పాటు వివాదాస్పదం కావడంతో ఆమెపై రాజస్థాన్ లోని బుండి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది.
దీంతో రాజస్థాన్ పోలీసులు ఆమెను అహ్మదాబాద్ లో అరెస్ట్ చేసి రాజస్థాన్ తీసుకెళ్లారు. రాత్రి ఆమెను బుండి జైల్లోనే ఉంచారు. జైల్లో క్రిమినల్స్ మధ్యన తనను ఉంచారని, తనకు నైట్ నరకం కనిపించిందని, చలిలో నేలపై పడుకున్నానని చెప్పింది పాయల్. బెయిల్ రావడంతో ఆమెను పోలీసులు విడిచిపెట్టారు. ఇంకెప్పుడు కూడా జైలుకు వెళ్లకూడదని దేవుడిని ప్రార్ధిస్తున్నట్టు ఆమె చెప్పింది.