బాలీవుడ్ నటి విద్యా సిన్హా (71) కన్నుమూశారు. గుండె, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆమె.. జుహూలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా విద్యా సిన్హాను వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందించారు. ‘చోటీ సి బాత్’, ‘రజనీ గంధ’, ‘పతి పత్నీ ఔర్ వో’ తదితర చిత్రాల్లో ఆమె నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
విద్యా సిన్హా నవంబరు 15, 1947 జన్మించారు. 18వ ఏట మోడల్గా, నటిగా కెరీర్ను ప్రారంభించిన ఆమె.. పలు బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరించారు. వివాహం అయిన తర్వాతే విద్యా సిన్హాకు నటించే అవకాశం వచ్చింది. కిరణ్కుమార్ పక్కన ‘రాజాకాక’ అనే చిత్రంతో ఆమె వెండితెరకు పరిచయం అయ్యారు. అయితే, అదే సమయంలో ఆమె నటించిన ‘రజనీగంధ’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఆమె నటించిన పలు చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. 1986 తర్వాత ఆమె సినిమాలకు గుడ్బై చెప్పి ఆస్ట్రేలియా వెళ్లిపోయారు. 2011లో సల్మాన్ఖాన్ హీరోగా నటించిన ‘బాడీగార్డ్’ ఆమె నటించిన చివరి చిత్రం. అయితే, బుల్లితెరపై మాత్రం వరసగా సీరియల్స్లో నటిస్తూ మెప్పించారు.