HomeTelugu Trendingసుశాంత్ గర్ల్ ఫ్రెండ్ పై కేసు నమోదు

సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ పై కేసు నమోదు

4 20
బాలీవుడ్‌ యువ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ బలవన్మరణానికి అతని ప్రియురాలు రియా చక్రవర్తి కారణమని పేర్కొంటూ ఓ వ్యక్తి బిహార్‌లోని ముజఫర్‌పూర్‌ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. సుశాంత్‌ ఈ నెల 14న తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. దీంతో ముజఫర్‌పూర్‌లోని పతాహీ ప్రాంతానికి చెందిన కుందన్‌ కుమార్‌.. బాలీవుడ్‌లోని నెపోటిజమ్‌ కారణంగానే సుశాంత్‌ ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొంటూ స్థానిక కోర్టులో ఇటీవల ఓ పిటిషన్‌ దాఖలు చేశాడు.

కాగా, తాజాగా ఆయన రియాచక్రవర్తిపై ఆరోపణలు చేస్తూ కోర్టులో కొత్తగా మరో పిటిషన్‌ వేశాడు. సుశాంత్‌ మానసిక ఒత్తిడికి రియా ఓ కారణమని, అంతేకాకుండా సుశాంత్‌ దగ్గర నుంచి ఆమె అధిక మొత్తంలో డబ్బు దోపిడీ చేసిందని సదరు పిటిషన్‌లో పేర్కొన్నాడు. కుందన్‌ పిటిషన్‌పై జూన్‌ 24న కోర్టులో విచారణ జరగనుంది. ఈ విషయంపై కుందన్‌ న్యాయవాది మాట్లాడుతూ.. ‘నా క్లయింట్‌ కుందన్‌ .. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌కు వీరాభిమాని. ఐపీసీ 306, 420 సెక్షన్స్ కింద అతను పిటిషన్‌ దాఖలు చేశాడు’ అని న్యాయవాది పేర్కొన్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu