సూపర్ స్టార్ కృష్ణ పార్థివదేహానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు.ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తెలంగాణ మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి, వెంకటేశ్, పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, విజయ్ దేవరకొండ, దర్శకులు త్రివిక్రమ్, బోయపాటి శ్రీను, మంచు విష్ణు తదితరులు కూడా భౌతిక కాయానికి నివాళులు అర్పించారు.
చిరంజీవి, వెంకటేశ్ చాలాసేపు మహేశ్ బాబు పక్కనే కూర్చొని ధైర్యం చెప్పారు. త్రివిక్రమ్.. మహేశ్ పక్కనే ఉన్నారు. నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు కృష్ణ నివాసంలోనే ఉండి ప్రముఖులను రిసీవ్ చేసుకుంటున్నారు.