HomeTelugu Big Storiesచరణ్, రాజుగారికి ఓకే చెప్తాడా..?

చరణ్, రాజుగారికి ఓకే చెప్తాడా..?

దిల్ రాజు, రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన ‘ఎవడు’ సినిమా మాస్ ప్రేక్షకుల ఆదరణ పొందింది. కమర్షియల్ గా ఈ సినిమా బాగా వర్కవుట్ అయింది. ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ సెట్ కానున్నట్లు సమాచారం. సుకుమార్ తో సినిమా చేస్తోన్న రామ్ చరణ్ తన తదుపరి సినిమా మణిరత్నంతో చేయాలనుకున్నాడు. కానీ ఇప్పుడు ఆ కాంబో సెట్ అయ్యే అవకాశాలే కనిపించడం లేదు. సుకుమార్ సినిమా దసరా నాటికి విడుదల కానుంది. ఈలోగా చరణ్ తన తదుపరి సినిమా విషయంలో ఓ నిర్ణయం తీసుకోవాలి.

అయితే చరణ్ తో ఓ భారీ బడ్జెట్ సినిమా ప్లాన్ చేస్తున్నాడు దిల్ రాజు. ఇప్పటికే ఓ స్టార్ డైరెక్టర్ ని కలిసి కథ కూడా సిద్ధం చేయమన్నట్లు తెలుస్తోంది. పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను రూపొందించనున్నారు. ఆ కథ చరణ్ కు వినిపించి ఓకే చెప్పించుకోవాలని చూస్తున్నాడు దిల్ రాజు. మరి దిల్ రాజు వ్యూహం ఫలిస్తుందా..? చరణ్
తన తదుపరి సినిమా దిల్ రాజు బ్యానర్ లో చేస్తాడా..? అనే విషయం తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే!

Recent Articles English

Gallery

Recent Articles Telugu