HomeTelugu Newsతెలంగాణలో 50 దాటిన కరోనా మృతులు

తెలంగాణలో 50 దాటిన కరోనా మృతులు

7 23
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. భారత్‌లో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతుండటంతో ప్రభుత్వాలు అప్రమత్తమవుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటోంది. వలస కార్మికులకు, విదేశాల నుంచి వచ్చే వాళ్లకు పరీక్షలు నిర్వహిస్తోంది. తెలంగాణలో ఇవాళ కొత్తగా 41 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య మొత్తం 1854కి చేరింది. కరోనా నుంచి కోలుకుని ఇవాళ 24 మంది డిశ్చార్జ్ కాగా, నలుగురు మృతి చెందినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకు తెలంగాణలో కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 53కి చేరింది. కొత్తగా నమోదైన 41 పాజిటివ్ కేసుల్లో హైదరాబాద్ పరిధిలో 23, రంగారెడ్డిలో 1, వలస కార్మికులు 11, విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఆరుగురు ఉన్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 1092కి చేరగా, వివిధ ఆస్పత్రుల్లో 709 మంది చికిత్సపొందుతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!