HomeTelugu Newsతెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసుల వివరాలు

తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసుల వివరాలు

16 1

తెలంగాణలో మరో 47 కరోనా కేసులు
తెలంగాణలో ఇవాళ కొత్తగా 47 మందికి కరోనా సోకినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో ఇప్పటి వరకు తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య 1414కి చేరింది. ఇవాళ కొత్తగా నమోదైన కేసుల్లో 40 కేసులు హైదరాబాద్‌ పరిధిలోనివే. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా బారినపడి 34 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా నుంచి కోలుకుని 952 మంది డిశ్చార్జి అయ్యారు. మరో 428 మంది చికిత్సపొందుతున్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు కరోనా మృతిచెందిన వారిలో 27మంది పురుషులు కాగా ఏడుగురు మహిళలు ఉన్నారు.

ఏపీలో మరో 36 కరోనా పాజిటివ్ కేసులు
ఆంద్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో కొత్తగా 36 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 2,100కి చేరినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనాతో ఇవాళ కర్నూలు జిల్లాలో ఒకరు మృతి చెందారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 48కి చేరింది. నిన్న 9,256 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది.

జిల్లాల వారీగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య : కర్నూలు 591, గుంటూరు 404, కృష్ణా 351, చిత్తూరు 151, అనంతపురం 118, నెల్లూరు 126, కడప 99, ప.గో 69, విశాఖ 66, ప్రకాశం 63, తూ.గో 51, శ్రీకాకుళం 7, విజయనగరం 4 కరోనా పాజిటివ్ కేసులు

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!